Andhra Pradesh: నేటితో ముగియనున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారం

Andhra Pradesh: ఈ నెల 10న పోలింగ్, 14న కౌంటింగ్ * 75 మున్సిపాలిటీల్లో మొత్తం 2123 వార్డులు

Update: 2021-03-08 03:17 GMT

ఎన్నికల ప్రచారం (ఫైల్ ఇమేజ్)

Andhra Pradesh: ఏపీలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. ఈ నెల 10న మున్సిపల్ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. 14న కౌంటింగ్ నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని 75 మున్సిపాలిటీల్లో మొత్తం 2వేల 123 వార్డులు ఉండగా వీటిలో 490 వార్డులు ఇప్పటికే ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 16వందల 33 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు జరగనున్న 12 కార్పొరేషన్లలో మొత్తం 671 డివిజన్లులు ఉండగా వాటిలో 89 ఇప్పటికే ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 582 డివిజన్లకు ఎన్నికలు జరగనున్నాయి.

Tags:    

Similar News