సీఎం జగన్‌తో ముకేష్‌ అంబానీ

Update: 2020-02-29 11:23 GMT
సీఎం జగన్‌తో ముకేష్‌ అంబానీ భేటీ

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డితో రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ భేటీ అయ్యారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌తో సమావేశమై రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టుల ఏర్పాటుపై చర్చించారు. ముకేశ్‌ వెంట ఆయన కుమారుడు అనంత్‌ అంబానీ, రాజ్యసభ సభ్యుడు, పారిశ్రామిక వేత్త పరిమల్‌ నత్వానీ కూడా ఉన్నారు. ఇవాళ్టి సీఎం షెడ్యూల్ లో ముకేశ్ అంబానీతో బేటీ లేకపోయినా సీఎం జగన్ తో ముకేశ్ సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 

Tags:    

Similar News