పీర్ల పండుగలో విషాదం..

Update: 2019-09-10 06:47 GMT

కర్నూలు జిల్లా బి.తాండ్రపాడులో మొహరం కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకుంది. మొహరం సందర్భంగా గ్రామంలో పీర్ల ఊరేగింపు జరుగుతుండగా ఇంటిపై గోడ కూలి 15 మందికి గాయాలయ్యాయి. ఊరేగింపును చూడటానికి వచ్చిన వారు ఎక్కువ సంఖ్యలో ఇంటిపైకి ఎక్కడంతోనే ఈ ఘటన జరిగింది. గాయపడిన వారిని వెంటనే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. విషయం తెలుసుకున్న కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు.




 


Tags:    

Similar News