చంద్రబాబు, పవన్ పై మండిపడ్డ విజయసాయిరెడ్డి

Update: 2019-11-07 06:55 GMT

'ఆత్మహత్యలపై టీడీపీ చేస్తున్న ప్రచారంపై ఘాటు విమర్శలు చేశారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఈ మేరకు ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.. 'అప్పట్లో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే తిన్నది అరక్క చస్తున్నారని నీచంగా వ్యాఖ్యానించాడు. మృతుల కుటుంబాలకు పరిహారం ఇస్తే డబ్బు కోసం ప్రాణాలు తీసుకుంటారని హేళన చేశాడు. ఇప్పుడు ఎవరో వ్యక్తిగత కారణాలతో చనిపోతే 25 లక్షల కాంపెన్షేషన్ ఇవ్వాలంటున్నాడు. నోరా తాటిమట్టా బాబూ?' అంటూ ఎద్దేవా చేశారు..

అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కూడా విమర్శలు గుప్పించారు.. 'ఒక్క సీటు వచ్చిన అనామతు పార్టీ అధ్యక్షుడిని 23 మంది ఎమ్మెల్యేలున్న మాస్టర్ మ్యానిపులేటర్ క్రేన్ పెట్టి పైకెత్తుతున్నాడు. అందనంత ఎత్తులో ఉన్న సిఎం జగన్ గారిపై పిడకలు వేయించే ప్రయత్నం చేస్తే అది వాళ్ల ముఖాలపైనే పడుతుంది.' అని విజయసాయిరెడ్డి తన ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.

Tags:    

Similar News