కాకినాడ నుంచి అన్నవరం వరకు ఎంపీ వంగా గీత పాదయాత్ర

Update: 2019-11-11 03:41 GMT

వైసీపీ ఎంపీ వంగా గీత పాదయాత్రను ప్రారంభించారు. కాకినాడ నుంచి అన్నవరం వరకు 50 కిలోమీటర్ల మేర వంగా గీత పాదయాత్ర చేస్తోన్నారు. అన్నవరం సత్యనారాయణ స్వామి సన్నిధి వరకు ఆమె పాదయాత్ర సాగనుంది. అనంతరం గిరిప్రదక్షణ చేయనున్నారు. కాకినాడలో ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, వైసీపీ నేతలు, కార్యకర్తలు పాదయాత్రలో పాల్గొన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయితే కాకినాడ నుంచి అన్నవరానికి నడుచుకుంటూ వస్తానని వంగా గీత సత్యనారాయణ స్వామికి మొక్కుకున్నారు. కార్తీకసోమవారం సందర్బంగా ఆమె తన మొక్కును చెల్లించుకొంటున్నారు. 

Tags:    

Similar News