కేంద్రం ఎవరిపైనా కక్ష సాధించదు- సుజనా చౌదరి

Update: 2019-07-14 15:42 GMT

కేంద్రం కావాలని ఎవరిపైనా కక్ష సాధించదని బీజేపీ నేత, రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరి తెలిపారు. గత ప్రభుత్వంలో గవర్నెన్స్ గాడి తప్పిందని ఆరోపించారు. విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జగన్, చంద్రబాబు ప్రధానిగా ఉన్నా కూడా ప్రత్యేకహోదా ఇవ్వలేరన్నారు. ప్రస్తుత ప్రభుత్వం పట్టుదలకి పోకుండా ప్యాకేజ్‌ని సాధించుకోవాలని తెలిపారు. టీడీపీ నుంచి బీజేపీలోకి ఎవరొస్తారో తెలియదని, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదన్నారు. పార్టీ ఆదేశిస్తే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని తెలియచేశారు సుజనా చౌదరి. 

Tags:    

Similar News