లోకేష్‌కు నిరసన సెగ.. టెంట్‌ కూల్చి వేసి కుర్చీలు విసురుకున్న టీడీపీ, వైసీపీ

Update: 2020-03-03 13:56 GMT
లోకేష్‌కు నిరసన సెగ.. టెంట్‌ కూల్చి వేసి కుర్చీలు విసురుకున్న టీడీపీ, వైసీపీ

తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలోని కాటవరంలో టీడీపీ ఎమ్మెల్సీ లోకేష్‌కు నిరసన సెగ తగిలింది. రాఘదేవపురంలో ఎన్టీఆర్‌ విగ్రహ ఆవిష్కరణకు వెళ్తున్న నారా లోకేష్‌కు వ్యతిరేకంగా వైసీపీ నేతలు నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ గోబ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు. వైసీపీ నేతలకు కౌంటర్‌గా టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టెంట్‌ కూల్చి వేసి కుర్చీలు విసురుకున్నారు.

Tags:    

Similar News