మండలిలో వికేంద్రీకరణ బిల్లుపై చర్చ నేపథ్యంలో టీడీపీకి షాక్ తగలింది. ఎమ్మెల్సీ పదవికి, టీడీపీకి డొక్కా మాణిక్య వరప్రసాద్ రాజీనామా చేశారు. గత కొంతకాలంగా పార్టీ వ్యవహారాలకు డొక్కా మాణిక్య వరప్రసాద్ దూరంగా ఉంటూ వస్తున్నారు.
అమరావతిని మూడు రాజధానులుగా విభజించినందుకు రాజీనామా చేస్తున్నట్లు స్పష్టం చేశారు. భవిష్యత్లో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించారు. రాజీనామా లేఖను చంద్రబాబుకు పంపించారు డొక్కా మాణిక్య వరప్రసాద్.