వికేంద్రీకరణ ద్వారా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడమే సీఎం జగన్ లక్ష్యమన్నారు ఎమ్మెల్యే రోజా. నేడు ఆమె శ్రీశైలం మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రోజా మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలు, ఎంపీలపై తమ వర్గంతో చంద్రబాబు దాడి చేయించడం సరికాదన్నారు. రాష్ట్రం అప్పుల్లో ఉందని డబ్బులు లేవని చెప్పి తాను మాత్రం దోచుకొని దాచుకున్నారని విమర్శించారు. జగన్ 9 నెలల కాలంలో ఏనాడూ రాష్ట్రం అప్పుల్లో ఉందని చెప్పకుండా ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నారన్నారు. చంద్రబాబు, లోకేష్ అండ్ కో జైలుకెళ్లే రోజులు దగ్గర్లో ఉన్నాయని ఆరోపించారు.