రోజాకు కీలక పదవి..ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

Update: 2019-07-10 15:53 GMT

నగిరి ఎమ్మెల్యే ఆర్కే రోజాకు కీలక పదవి దక్కింది. మంత్రివర్గంలోకి తీసుకోకపోవడంతో అసంతృప్తికి గురైన నగిరి ఎమ్మెల్యే రోజాను ఏపీఐఐసీ ఛైర్ పర్సన్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె ఈ పదవిలో రెండు సంవత్సరాలు కొనసాగనున్నారు. ఏపీలో మంత్రి పదవులు కేటాయింపు సమయంలో రోజాకు హోం శాఖను కేటాయిస్తున్నట్టుగా బాగా ప్రచారం జరిగింది. అయితే ఆమెకు ఎలాంటి పదవి కేటాయించలేదు. ఆ తర్వాత ప్రభుత్వం మౌళిక సదుపాయాల కల్పనా సంస్ధ ఛైర్మన్ పదవిని ఇస్తున్నట్టుగా ప్రకటించారు. తాజాగా ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.Full View

Tags:    

Similar News