టీడీపీ బంధిపోటుల ముఠా రాష్ట్రాన్ని దోచుకుందన్నారు నెల్లూరు వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. టీడీపీ నాయకులు రాష్ట్రాన్ని క్లిష్టపరిస్థితుల్లోకి నెట్టేశారని, గాడిలో పెడుతున్న సీఎం జగన్పై టీడీపీ వాళ్లు అక్కసుతో ఉన్నారని మండిపడ్డారు. విలువలు, విశ్వనీయతపై చంద్రబాబు మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉందన్నారు. ఐదేళ్లు ఇసుక దోచుకున్న లోకేష్ ఇప్పుడు ఇసుక ప్యాకెట్లు మెడలో వేసుకుని దీక్షచేస్తుంటే విడ్డూరంగా ఉందని ఎద్దేవ చేశారు.