Kotamreddy Sridhar Reddy: ప్రజాసమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే కోటంరెడ్డి వినూత్న నిరసన
Kotamreddy Sridhar Reddy: ముఖ్యమంత్రి సంతకానికే విలువ లేదా?
Kotamreddy Sridhar Reddy: ప్రజాసమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే కోటంరెడ్డి వినూత్న నిరసన
Kotamreddy Sridhar Reddy: నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరోసారి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పొట్టేపాలెం కలుజువాకపై వంతెన కోసం దీక్ష చేపడితే ప్రభుత్వం అడ్డుకుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక అమరావతిలో తన ఆందోళన కొనసాగుతుందన్నారు. వంతెన సాధించేవరకు ప్రజా పోరాటం ఆగదన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటం కొనసాగిస్తానని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా చేపట్టిన జగనన్న కార్యక్రమానికి ప్రత్యామ్నాయంగా జనం మాట విందాం అనే కార్యక్రమానికి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శ్రీకారం చుట్టనున్నట్లు ఆయన తెలిపారు.