ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా కోన రఘుపతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్ తమ్మినేని సీతారాం అధికారికంగా ప్రకటించారు. డిప్యూటీ స్పీకర్గా రఘుపతి ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డిప్యూటీ స్పీకర్ ను సభాపతి స్థానానికి జగన్, చంద్రబాబు తీసుకువచ్చారు. రఘుపతి సీఎం వై.ఎస్.జగన్తో పాటు ప్రతిపక్ష, విపక్ష సభ్యులు అభినందించారు.