వారిపై కేసు నమోదు చేయాలంటూ ఎమ్మెల్యే భవానీ దిశ పీఎస్లో ఫిర్యాదు.. చట్టం ఇంకా అమల్లోకి రాలేదన్న డీఎస్పీ
సోషల్ మీడియాలో తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ రాజమండ్రిలోని దిశా పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆదిరెడ్డి భవానికి మద్ధతుగా పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు దిశ పోలీస్స్టేషన్కు తరలివచ్చారు. దిశ చట్టం కింద కేసు నమోదు చేయాలని ఎమ్మెల్యే భవానీ, టీడీపీ నేతలు కోరారు.
అయితే దిశా చట్టం ఇంకా అమల్లోకి రాలేదని సమాధానం చెప్పడంతో టీడీపీ నేతలు- డీఎస్పీకి మధ్య చర్చ జరిగింది. ఎమ్మెల్యే భవానీ మాట్లాడుతూ... దిశ పీఎస్లో ఫిర్యాదు చేస్తే ఇంకా చట్టం అమల్లోకి రాలేదని అంటున్నారని దిశ పీఎస్ ప్రారంభం పేరుతో సీఎం అబద్ధపు ప్రచారం చేశారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.