సీబీఐ కేసులు, నేరచరిత్ర కలిగిన ముద్దాయిలను టీటీడీ బోర్టు సభ్యులుగా నియమించారని మాజీ మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. ప్రభుత్వం తిరుమల పవిత్రతను కాలరాస్తోందన్నారు. శేఖర్రెడ్డి దగ్గర లోకేష్ వంద కోట్లు తీసుకుని బోర్డు మెంబర్గా నియమించారని విజయసాయిరెడ్డి గతంలో ఆరోపించారని , ఇప్పుడు మీ ప్రభుత్వం ఎన్ని కోట్లు తీసుకుని ఆయనను బోర్డు మెంబర్గా నియమించిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.