చంద్రబాబు, టీడీపీ నేతల తీరుపై మంత్రి రోజా తీవ్ర ఆగ్రహం

Minister Roja: అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయలేని చంద్రబాబు.. నేడు మహిళా సాధికరత గురించి మాట్లాడటం సిగ్గచేటు

Update: 2022-04-29 11:54 GMT

ప్రతిపక్ష నేత చంద్రబాబు, టీడీపీ నేతలు తీరుపై.. మంత్రి రోజా సెల్వమని తీవ్ర ఆగ్రహం

Minister Roja: సుధీర్ఘ కాలం రాజకీయాల్లో ఉండి ఏం చేయలేదని చంద్రబాబు నేడు మహిళాసాధికారిత గురించి మాట్లాడటం సిగ్గుచేటన్నారు మంత్రి రోజా. మొన్న విజయవాడ, నిన్న గుంటూరులో మహిళా కమిషన్ ఛైర్మన్ ను ఆపార్టీ నేతలు అడ్డున్న వ్యవహరాంపై రోజా సీరియస్ అయ్యారు. మహిళల పట్ల ఎలా ప్రవర్తించాలో తెలియని వీరు కూడా ఓ రాజకీయ నేతలా అని ప్రశ్నించారు. కనీసం సొంతంగా పార్టీ పెట్టుకోలేని , తన కొడుకుని సైతం గెలిపించుకోలేని చంద్రబాబు నేడు వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. ఇకపై ఎవరైనా మహిళా కమిషన్ ఛైర్మన్ నుఅడ్డుకుంటే శిక్షించేలా చట్టాలు తీసుకొస్తామన్నారు. టీడీపీ నేతలకు అవసరమైతే ఏ చీరలు కావాలో చెబితే అవి పంపిస్తామని సెటైర్ వేశారు రోజా.

Tags:    

Similar News