తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి రోజా, శ్రీముఖి
Tirumala: నైవేద్య విరామ సమయంలో స్వామివారి దర్శనం
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి రోజా, శ్రీముఖి
Tirumala: తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాళ స్వామి వారి నైవేద్య విరామ సమయంలో ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజాతో పాటుగా ప్రముఖ యాంకర్ శ్రీముఖి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కలు చెల్లించుకున్నారు. దర్శనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వాదం పలుకగా, ఆలయ అధికారులు పట్టువస్తంతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.