గ్రామ సచివాలయాల పరీక్షలు పారదర్శకంగా జరుపుతామన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. సెప్టెంబర్ 1 నుంచి 8 వరకు జరిగే సచివాలయ పరీక్షల కోసం అన్ని ఏర్పాటు పూర్తి చేశామని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. 5వేల 114 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. పరీక్షల నిర్వహణకు ఏపీపీఎస్సీ సాంకేతిక సహకారాన్ని తీసుకుంటున్నామన్నారు. అభ్యర్థులు దళారులను నమ్మవద్దని సూచించారు మంత్రి పెద్దిరెడ్డి.