ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు ముందు మద్యపాన నిషేధం చేస్తామని ప్రస్తుత అధికార పార్టీ వైసీపీ తెలిపిన సంగతి అందరికి తెలిసిందే .. అయితే తొలుత అన్ని బెల్టుషాపులు మూసివేస్తున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. అయితే దీనిని అంచెలంచెలుగా నిషేధం చేస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామి ప్రకటించారు. తొలి విడతలో బెల్ట్ షాపుల నిర్మూలనపై దృష్టి పెట్టడం జరుగుతుందన్నారు. నాటుసారా అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు ఉంటాయని, బడికి, గుడికి దూరంగా మద్యం షాపులు ఉండే విధంగా చర్యలు పేదలకు మద్యం దూరం చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అయన వెల్లడించారు.