Kodali Nani: టీడీపీపై మంత్రి కొడాలి నాని ఫైర్‌

Kodali Nani: రైతుల ముసుగులో టీడీపీ నేతలు నాటకాలడుతున్నారని ఆరోపణ * రైతు రాజులా బతకాలన్నదే వైసీపీ ప్రభుత్వ ధ్యేయం: కొడాలి

Update: 2021-07-18 10:53 GMT

మంత్రి కొడాలి నాని (ఫోటో ది హన్స్ ఇండియా)

Kodali Nani: రైతుల ముసుగులో టీడీపీ నేతలు నాటకాలాడుతున్నారని మంత్రి కొడాలి నాని ఆరోపించారు. చంద్రబాబు హయాంలో రైతులను పట్టించుకోలేదని, బాబు హయాంలో ఐదేళ్లలో చెల్లించింది మేం ఏడాదిలోనే చెల్లించామన్నారు. ధాన్యం కొనుగోలు చేసి రైతులకు డబ్బులివ్వలేదని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రెండేళ్లలో 83 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు. కేంద్రం రాష్ట్ర సివిల్ సప్లైకు 5,056 కోట్లు చెల్లించాలని, ఈ నెలాఖరులోగా రైతులకు ఇవ్వాల్సిన ప్రతిపైసా కూడా ఇస్తామని స్పష్టం చేశారు.

Tags:    

Similar News