రాజధాని విషయంలో ఎలాంటి అపోహలు పడొద్దు :‌ మంత్రి గౌతమ్ ‌రెడ్డి

Update: 2019-08-22 15:02 GMT

రాజధానిగా అమరావతినే కొనసాగుతుందని ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు. రాజధాని ప్రాంతంలో వరద వచ్చే అవకాశం ఉన్నందునే సహచర మంత్రి బొత్స వ్యాఖ్యలు చేశారని తెలిపారు. రాజధాని విషయంలో ఎలాంటి అపోహలు పడొద్దని చెప్పారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం వాశిలి, నెల్లూరు పాలెం, వెన్నవాడ, తదితర గ్రామాల్లో మంత్రి పర్యటించారు. తొలుత వాశిలి గ్రామంలో నాగవరపమ్మ పుట్టను దర్శించి ప్రత్యేక పూజలు చేశారు.

Full View  

Tags:    

Similar News