ఉద్యోగ సంఘం నేతలతో బొత్స, సజ్జల భేటీ

Andhra Pradesh: హాజరైన సచివాలయ ఉద్యోగుల సంఘం నేతలు..

Update: 2022-07-28 02:10 GMT

ఉద్యోగ సంఘం నేతలతో బొత్స, సజ్జల భేటీ

Andhra Pradesh: ఉద్యోగ సంఘం నేతలతో ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చర్చలు జరిపారు. ఉద్యోగులకు సంబంధించిన సమస్య పట్ల ప్రభుత్వ సానుకూలంగా స్పందించిందని ఉద్యోగ సంఘం నేతలు వెంకట్రామిరెడ్డి, బండి శ్రీనివాస్ తెలిపారు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులోని ప్రధాన పట్టణాల్లో ఉద్యోగుల హెల్త్ కార్డులు చెల్లుబాటు అయ్యే విధంగా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పీఆర్సీ, ఫిట్ మెంట్ పై పెండింగ్ లో ఉన్నవారికి అమలుతో పాటు  సీపీఎస్ సంఘాలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. జీపీఎఫ్ నిధుల మళ్లింపు, డీఏ చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు వెల్లడిచారు.

Tags:    

Similar News