టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి బొత్స ఫైర్

టీడీపీ సభ్యులు కేవలం ఘర్షణ కోసమే అసెంబ్లీకి వచ్చారని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారన్నారు.

Update: 2020-12-05 15:45 GMT

టీడీపీ సభ్యులు కేవలం ఘర్షణ కోసమే అసెంబ్లీకి వచ్చారని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారన్నారు. సభా సంప్రదాయాలకు విలువ ఇవ్వకుండా అసెంబ్లీలో స్పీకర్‌ను, మండలిలో ఛైర్మన్‌ను చుట్టుముట్టారని దుయ్యబట్టారు. సభా నియమాలు పాటించకుండా బాబు పోడియం వద్ద బైఠాయించి.. స్పీకర్‌ను బెదిరించేలా అనుచితంగా మాట్లాడారని, స్పీకర్‌పై చంద్రబాబు వ్యక్తిగత దూషణలకు దిగి సభను అపహాస్యం చేశారని మండి పడ్డారు. 

Tags:    

Similar News