బుల్లెట్‌ దిగిందా లేదా?: మంత్రి అనిల్‌ కుమార్

Update: 2019-07-11 10:16 GMT

ఏపీ అసెంబ్లీలో కరవుపై చర్చ సందర్భంగా అధికార-ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం సాగింది. రైతులకు సున్నా వడ్డీ పథకంపై సీఎం జగన్ సవాల్ విసిరారు. చంద్రబాబు హయాంలో వడ్డీ లేని రుణాల కోసం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని అన్నారు. ఈ క్రమంలో అధికార విపక్ష, సభ్యుల మధ్య వాదోపవాదాలు జరిగాయి. మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా ఈ చర్చలో పాల్గొని తనదైన స్టయిల్లో పంచ్ డైలాగ్ పేల్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. 40 ఇయర్స్‌ ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్న చంద్రబాబు.. మేం అడిగిన దానికి సమాధానం చెప్పడం లేదని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ అడిగితే సమాధానం చెప్పకుండా పారిపోయారని విమర్శించారు. 40 ఇయర్స్‌ ఇండస్ట్రీ కాదు.. బుల్లెట్‌ దిగిందా లేదా? అంటూ వ్యాఖ్యానించారు. విపక్షానికి బుల్లెట్ దిగింది కాబట్టే సబ్జెక్ట్ నుంచి వాళ్లు పక్కకు పోతున్నారని ఆయన విమర్శించారు. 

Full View 

Tags:    

Similar News