కరకట్ట వద్ద రిటర్నింగ్ వాల్ నిర్మిస్తాం..వరద నీటిలో 4 వేల ఇళ్లు మునిగిపోయాయి
కృష్ణలంక కరకట్ట వద్ద రిటర్నింగ్ వాల్ నిర్మిస్తామన్నారు మంత్రి అనిల్ కుమార్. రిటైరింగ్ వాల్ నిర్మాణానికి అయ్యే ఖర్ఛును అంచనా వేయమని ఆయన అధికారులకు ఆదేశించారు. దాదాపు 3వేల మంది వరద బాధితులను పునరావాస కేంద్రాలను తరలించినట్లు చెప్పారు. నాలుగు వేల ఇళ్లు వరద నీటిలో మునిగిపోయాయని తెలిపారు. విజయవాడలో వరద పరిస్థితి గురించి అమెరికా పర్యటనలో ఉన్న సీఎం జగన్ ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకోని ఆదేశాలు జారీ చేస్తున్నారని మంత్రి అనిల్ కుమార్ వెల్లడించారు.