Vijayawada: సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో కార్మిక సంఘాల సమావేశం

Vijayawada: ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు

Update: 2021-03-09 07:26 GMT

సిపిఐ మీటింగ్ (ఫైల్ ఫోటో)

Vijayawada: విజయవాడ సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో కార్మిక సంఘాలు సమావేశం నిర్వహించారు. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు. 11,12వ తేదీల్లో నేషనల్‌ హైవేల దిగ్బంధనం, నిరసన ప్రదర్శనలు, దిష్టిబొమ్మ దహనాలకు పిలుపునిచ్చారు. 13, 14వ తేదీన కేంద్ర మంత్రులకు వినతి పత్రాలు ఇవ్వాలని 15వ తేదీన కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముట్టడికి పిలుపునిచ్చారు కార్మిక సంఘాలు. ఇక 16వ తేదీన ఏపీ వ్యాప్తంగా అఖిలపక్షం, ప్రజా సంఘాలు మరోసారి కీలక సమావేశం నిర్వహించాలని నిర్ణయించాయి.

Tags:    

Similar News