పవన్ కల్యాణ్ రాయలసీమ పర్యటన సందర్బంగా దొంగలు తమ చేతివాటం ప్రదర్శించారు. పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికేందుకు ఆదివారం మధ్యాహ్నం వందలాదిమంది అభిమానులు రేణిగుంట విమానాశ్రయానికి వచ్చారు. తీరా పవన్ కళ్యాణ్ అక్కడినుంచి వెళ్లిపోయాక 25మంది తమ సెల్ ఫోన్లను పోగొట్టుకున్నారు.
సందులో సడేమియా అంటూ ఆ గుంపులో దొంగలు కూడా దూరి సెల్ ఫోన్లను కొట్టేశారు. దీంతో లబోదిబోమంటూ అభిమానులంతా పోలీసుల దగ్గరకి పరిగెత్తారు. వారందరి దగ్గర మినిమమ్ 10వేలు ఖరీదు చేసే స్మార్ట్ ఫోన్లు ఉన్నట్టు తెలుస్తోంది. కొంతమంది IMEI నంబర్లు ఇవ్వడంతో ట్రేసింగ్ లో పెట్టారు. కాగా విశాఖ ఇసుక ధర్నాలో కూడా పవన్ అభిమానులు పర్సులు, ఫోన్లను పోగొట్టుకున్న సంగతి తెలిసిందే.