ఫలితాలకు ముందే జనసేనకు ఎదురుదెబ్బ

Update: 2019-05-02 14:48 GMT

ఎన్నికలు ముగిసి 20 రోజులు పూర్తి అయింది. ఫలితాలు రావడానికి ఇంకా 20 రోజుల సమయం ఉంది. ఏపీలో ఇప్పటినుంచే రాజీనామాలు చేస్తున్నారు అసంతృప్తి లీడర్లు. ప్రస్తుతం జనసేన పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన సీనియర్‌ నేత, కోశాధికారి మారిశెట్టి రాఘవయ్య పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు పంపించారు. పొత్తుల విషయంలో పవన్ వైఖరి నచ్చకనే రాఘవయ్య ఆ పార్టీకి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. రాఘవయ్యతో పాటు మరో నేత అర్జున్ కూడా జనసేనకు రాజీనామా చేశారు. మరోవైపు జనసేన అధికార ప్రతినిధి అద్దెపల్లి శ్రీధర్‌ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.

Similar News