గుంటూరు నుంచి మొదలు పెట్టిన పాదయాత్రకు అనుమతి నిరాకరించడం.. జగన్ పాలనకు నిదర్శనమని.. ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. పాలకుల నిర్ణయాలు అనుగుణంగా పోలీస్ యంత్రాంగం పనిచేస్తుందని విమర్శించిన ఆయన.. జగన్ పాలన భవిష్యత్తులో ఎలా ఉంటుందో పాదయాత్రను అడ్డుకోవడంతోనే రుజువైందని విమర్శించారు.. సీఎం ఆత్మ విమర్శ చేసుకొని ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని ఆయన డిమాండ్ చేశారు..