చిత్తూరు : కరోనా వైరస్ అనుమానంతో వ్యక్తి ఆత్మహత్య

Update: 2020-02-11 08:52 GMT
చిత్తూరు : కరోనా వైరస్ అనుమానంతో వ్యక్తి ఆత్మహత్య

చిత్తూరు జిల్లాలో కరోనా వైరస్ అనుమానంతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తొట్టంబేడు మండలం శేషమనాయుడు కండ్రిగకు చెందిన బాలకృష్ణ రెండు రోజుల క్రితం తిరుపతి రుయా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నాడు. వైరస్ సోకిందని డాక్టర్లు చెప్పడంతో కరోనా అని అనుమానంతో ఆత్మహత్య చేసుకున్నాడు.

ఎవరిని దగ్గరకు రానివ్వకుండా అడ్డుకున్నాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. రెండు రోజులుగా తన కుటుంబ సభ్యులను కూడా తన వద్దకు రావద్దంటూ తనని తానే ఓ గదిలో నిర్బంధించుకున్నాడు. అనంతరం నిన్న పొలానికి వెళ్లి తన పొలంలోనే చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది గమనించిన చుట్టుపక్కల వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అధికారులు వైరస్ పట్ల ప్రచారం కల్పించకపోవడంతోనే బాలకృష్ణ ఆత్మహత్యకు పాల్పడ్డారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. 

Tags:    

Similar News