ఓ వైపు విషాదం మరోవైపు సైబర్ చీటింగ్. అసలే బోటు ప్రమాదంలో తమ వారిని పోగొట్టుకుంటే, మరోవైపు డబ్బులు కాజేశాడు ఓ ప్రబుద్ధుడు. విశాఖ వేపగుంటలో నివాసముండే బొండ లక్ష్మీ, ఆమె కుమార్తె పుష్ప బోటు ప్రమాదంలో మృతి చెందారు. అయితే మృతి చెందిన వారి బంధువులకు ఓ వ్యక్తి ఫోన్ చేసి, తమకు నష్టపరిహారం వచ్చిందని, బ్యాంకు వివరాలు తెలపాలని కోరాడు. ఆపై మొబైల్కు వచ్చే ఓటీపీ వివరాలు తెలుసుకుని బాధితుని బ్యాంక్ నుండి 7వేల 200 రూపాయలను స్వాహా చేశాడు. ఆలస్యంగా విషయం గ్రహించిన బాధితులు మీడియాను ఆశ్రయించారు.