Visakhapatnam: విశాఖ శ్రీ శారదాపీఠంలో రాజశ్యామల అమ్మవారి మహోత్సవాలు

Visakhapatnam: నాలుగో రోజు అన్నపూర్ణాదేవీ అవతారంలో దర్శనం

Update: 2023-10-18 07:06 GMT

Visakhapatnam: విశాఖ శ్రీ శారదాపీఠంలో రాజశ్యామల అమ్మవారి మహోత్సవాలు

Visakhapatnam: విశాఖ శ్రీ శారదాపీఠంలో రాజశ్యామల అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాలు కొనసాగుతున్నాయి. అమ్మవారు నాలుగో రోజు అన్నపూర్ణా దేవీ అవతారంలో దర్శనమిచ్చారు. అన్న పాత్ర, గరిటె చేతపట్టిన అమ్మవారి అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాములు అమ్మవారి అలంకరణకు హారతులిచ్చి పూజలు చేశారు. లోక కళ్యాణార్ధం పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాములు రాజశ్యామల యాగం నిర్వహిస్తున్నారు.

Tags:    

Similar News