మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు నందమూరి తారక రామారావు జీవితంలో చోటుచేసుకున్న ఒడిదుడుకుల సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' ముఖ్యంగా ఎన్టీఆర్ జీవితంలోకి ఆయన రెండో భార్య లక్ష్మి పార్వతి ప్రవేశించాక జరిగిన ఘటనల ఆధారణగా ఈ సినిమా తెరకెక్కింది. సినిమా ఏపీలో మే 1న బుధవారం ప్రేక్షకుల ముందుకు రానుంది.
చిత్తూరు జిల్లా పలమనేరులోని మంజునాథ థియేటర్లో బుధవారం ఉదయం 9.47 గంటలకు ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిత్ర దర్శకులు రామ్గోపాల్ వర్మ, నటీ నటులు హాజరుకానున్నట్టు చిత్ర నిర్మాత రాకేష్రెడ్డి వెల్లడించారు. కాగా ఎన్నికల ముందే ఈ సినిమా ఏపీలో విడుదల అవ్వాల్సి ఉండగా టీడీపీ నేతలు కోర్టును ఆశ్రయించడంతో వాయిదా పడింది.