'సైరా' సినిమాకు వెళ్లిన ఆరుగురు ఎస్సైలు... షాక్ ఇచ్చిన ఎస్పీ

Update: 2019-10-02 07:07 GMT

కర్నూలు జిల్లాలో ఆరుగురు ఎస్‌ఐలపై జిల్లా ఎస్పీ వేటు వేశారు. ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా సైరా మూవీకి వెళ్లడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు ఉదయం కోవెల కుంట్ల, నందివర్గం స్టేషన్‌లకు చెందిన ఎస్‌ఐలు సైరా సినిమాకు వెళ్లారు. అయితే నిబంధనల ప్రకారం ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చిన తరువాతే సినిమాకు వెళ్లాల్సి ఉండగా ఎలాంటి సమాచారం లేకుండా వీరంతా సినిమాకు వెళ్లారు. దీంతో ఆరుగురిని వీఆర్‌కు పంపుతూ ఎస్పీ ఫక్కీరప్ప ఆదేశాలు జారీ చేశారు. 

Tags:    

Similar News