కచ్చులూరు వద్ద బోటు మునక ఘటన గోదావరి చరిత్రలో ఓ మరక అని మంత్రి కన్నబాబు చెప్పారు. బోటును వెలికితీసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నామన్నారు. 300 అడుగుల లోతులో బోటు ఉన్నట్లు అంచనా వేస్తున్నామన్నారు. ఎవరైనా బోటు తీస్తామని వస్తే జిల్లా అధికారులతో మాట్లాడాలని సూచించారు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్టీఆర్ఎఫ్ గాలింపు కొనసాగుతుందని మంత్రి స్పష్టం చేశారు. ఇంకా ఆచూకీ తెలియనివారి కుటుంబసభ్యులు డెత్ సర్టిఫికెట్ కోరుతున్నారని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు. బోటు ప్రమాదంలో ప్రయాణికులను రక్షించినవారికి నగదు పురస్కారం అందజేస్తున్నట్లు తెలిపారు.