ప్రభుత్వ మాజీ విప్ కూన రవి అజ్ఞాతం వీడారు. ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగిస్తూ, దురుసుగా ప్రవర్తించారన్న విషయంలో కేసు నమోదైంది. గత నెల 26న కూన రవిపై సరబుజ్జిలి పోలీసులకు ఎంపీడీవో ఫిర్యాదు చేశారు. అయితే ఆ మరుసటి రోజు నుంచి కూన రవి పరారీలో ఉన్నాడు. తాజాగా అతనికి ముందస్తు బెయిల్ మంజూరు కావడంతో అజ్ఞాతం వీడారు.