మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ తెలుగుదేశం పార్టీలో చేరేందుకు తేదీని ఖరారు చేసుకున్నట్టు ఈనెల 17న టీడీపీలోకి మాజీ మంత్రి.. రేపు వైసీపీలోకి ప్రత్యర్థి..తెలుస్తోంది. ఆయన ఈ నెల 17న ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరబోతున్నారు. కొణతాలకు అనకాపల్లి లోక్సభ బరిలో దింపేందుకు చంద్రబాబు ఆలోచిస్తున్నట్టు సమాచారం. అనకాపల్లి లోక్సభకు ముగ్గురి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అందులో మొదటి పేరు కొణతాల రామకృష్ణదే. మరొకరు విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి తులసీరావు కుమారుడు ఆడారి ఆనంద్. మూడో వ్యక్తి అయ్యన్న కుమారుడు విజయ్.
కాగా కొణతాల టీడీపీలో చేరుతుండటంతో ఆయన ప్రత్యర్థి మాజీ మంత్రి దాడి వీరభద్రరావు మళ్ళీ వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. కొణతాల ఎక్కడ నుంచి పోటీ చేసినా ఓడిస్తానని దాడి శపధం చేశారు.. 2014 ఎన్నికల ముందు వైసీపీలో చేరిన దాడి.. ఎన్నికల అనంతరం జగన్ తో విభేదించి రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలో ఆయన రేపు(మార్చి 9) జగన్ సమక్షంలో దాడి, ఆయన కుమారుడు రత్నాకర్ వైసీపీలో చేరనున్నారు.