దేవిపట్నం పడవ ప్రమాదానికి సంబంధించిన కేసులో పోలీసలు పురోగతి సాధించారు. ప్రమాదానికి గురైన బోటు యాజమాని కోడిగుడ్ల వెంకటరమణను తూర్పుగోదావరి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. 30మందికిపైగా ప్రణాలను బలి తీసుకున్న ఈ ప్రమాదంలో నిందితులుగా భావిస్తున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బోటు ఓనర్ కోడిగుడ్ల వెంకటరమణతో పాటు ఎల్లా ప్రభావతి, అచ్యుతరమణిని కూడా అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలో బోటు నిర్వహకుడు కోడిగుడ్ల వెంకటరమణను పోలీసులు అరెస్టు చేశారు. ప్రమాదం జరిగిన రోజున బోటులో 75 మందిని బోటులో ఎక్కించుకున్నట్టు వెంకటరమణ తెలిపారు.