రేపు నర్సరావుపేటలో కోడెల అంత్యక్రియలు..అధికార లాంఛనాలతో నిర్వహించాలని సీఎం జగన్ ఆదేశం
నర్సరావుపేటలో రేపు కోడెల అంత్యక్రియలు జరగనున్నాయి. అయితే, కోడెల అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాలతో సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం ఉత్తర్వులు ఇచ్చారు. అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయాలని డీజీపీ, గుంటూరు కలెక్టర్, ఎస్పీకి ఆదేశించారు. కాగా, కోడెల శివప్రసాదరావు పార్థీవ దేహాన్ని హైదరాబాద్ నుంచి నరసరావుపేటకు తరలిస్తున్నారు. సోమవారం హైదరాబాద్లో అనుమానాస్పదరీతిలో కోడెల శివప్రసాదరావు మృతి చెందారు. ఆయన ఆత్మహత్య చేసుకున్నారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.