టీడీపీ సీనియర్ నేత, ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు శుక్రవారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు ఆకస్మికంగా గుండెపోటు రావడంతో గుంటూరులోని కోడెల కుమార్తె విజయలక్ష్మికి చెందిన శ్రీలక్ష్మీ మల్టీస్పెషాలిటీ ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఆయనకు ఎలాంటి ప్రాణప్రాయం లేదని వైద్యులు తెలిపారు.