ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమార్తె విజయలక్ష్మి గురువారం కోర్టులో లొంగిపోయారు. ఉద్యోగాల పేరుతో రూ. లక్షలు వసూలు చేసి కొందరు వ్యక్తులను మోసం చేశారని ఆమె ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆమెపై కేసు నమోదయింది. ఈ విషయంలో కోర్టుకు హాజరయ్యారు. అయితే ప్రస్తుతానికి ఆమెకు రెండు కేసుల్లో బెయిల్ మంజూరు అయింది. ప్రతి ఆదివారం వన్టౌన్, టూటౌన్ స్టేషన్లలో సంతకం చేయాలని.. 1వ అదనపు జిల్లా మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు విజయలక్ష్మికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.