సీఎం జగన్ దెబ్బకు చంద్రబాబు గ్యాలరీ ఎక్కారు

Update: 2020-01-23 11:53 GMT
కొడాలి నాని

ఏపీ అసెంబ్లీలో టీడీపీ అధినేత చంద్రబాబుపై పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 40 ఏళ్లు అనుభవం, 14 ఏళ్లు ముఖ్యమంత్రి, పదేళ్లు ప్రతిపక్ష నాయకుడినని చెప్పుకునే చంద్రబాబు జగన్ దెబ్బకు మండలి గ్యాలరీ ఎక్కి కూర్చున్నారని ఎద్దేవా చేశారు. నెక్ట్స్ టైమ్ అసెంబ్లీ గ్యాలరీ ఎక్కించాలని సీఎం జగన్‌ను కోరారు కొడాలి నాని. బుధవారం శాసనమండలిలో చోటుచేసుకున్న పరిణామాలపై నేడు శాసనసభలో చర్చ చేపట్టారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిన్న అశోక్‌బాబు మండలి చైర్మన్‌ షరీఫ్‌ వద్దకు వెళ్లాడనేది అవాస్తమని చెప్పారు. రూల్స్‌ పాటిస్తానని చెప్పిన మండలి చైర్మన్‌ తన మాటకు కట్టుబడలేదని అన్నారు. చంద్రబాబు డైరెక్షన్‌లో నిన్న టీడీపీ మండలి సభ్యులు వ్యవహరించారని పేర్కొన్నారు. యనమల పేరెత్తితే ఎన్టీఆర్‌కి పొడిచిన వెన్నుపోటే గుర్తొస్తుందని, ఆయన కూడా ప్రభుత్వానికి సలహాలు ఇస్తారా అని ప్రశ్నించారు.


Full View


Tags:    

Similar News