Kodali Nani: షర్మిలకు స్టీల్ ప్లాంట్, పోలవరం ఇప్పుడు గుర్తొచ్చాయా..?
Kodali Nani: పదవికోసమే, సీఎం జగన్ను షర్మిల నిందిస్తున్నారు
Kodali Nani: వైసీపీ సర్కారు, సీఎం జగన్పై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేస్తున్న వ్యాఖ్యలపై మాజీ మంత్రి కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదవి కోసమే షర్మిల.. సీఎం జగన్పై నిందలు వేస్తున్నారు. తెలంగాణలో షర్మిల పాదయాత్ర చేస్తే ఏం జరిగిందో అందరికీ తెలుసన్నారు. ఏపీలో పుట్టానని చెబుతున్న షర్మిలకు..స్టీల్ప్లాంట్, పోలవరం ఇప్పుడు గుర్తుకువచ్చాయా..? అని ప్రశ్నించారు. రాజకీయ లబ్ధి కోసమే సీఎం జగన్పై షర్మిల విమర్శలు చేస్తున్నారని కొడాలి నాని అన్నారు.