అక్రమ కేసులతో తమ తండ్రి కోడెలను వేధించారని ఇక నుంచి అయినా తమను వదిలేయాలన్నారు కోడెల కుమార్తె విజయలక్ష్మి. కోడెల మృతి నేపథ్యంలో ఆమె మీడియా ముందుకు వచ్చి కన్నీటి పర్యంతమయ్యారు. చనిపోయిన వ్యక్తి మీద అబండాలు వేస్తున్నారని దయచేసి అలా చేయకండని కోరారు. కనీసం తమ తండ్రి వయసుకైనా గౌరవం ఇవ్వాలన్నారు. నాన్న అంటే తమకు ప్రాణమని మా మధ్య ఎలాంటి గొడవలు లేవని కోడెల కుమార్తె చెప్పారు. తండ్రి చాటు బిడ్డల్లా బతికాం.. మా బతుకు మాకు బతకనివ్వండి" అంటూ ఆమె వ్యాఖ్యానించారు. చనిపోయిన వ్యక్తిపై చెడు ప్రచారాలు తగదన్నారు.