లోక్ సభలో కియా మోటర్స్ రగడ.. వైసీపీ ఎంపీని వారించిన స్పీకర్ !

Update: 2020-02-06 08:46 GMT

కియా మోటర్స్ వ్యవహరం లోక్ సభలో వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. కియా మోటర్స్ ఏపీ నుంచి తరలిపోతుందంటూ టీడీపీ ఎంపీ రాంమోహన్ నాయుడు సభ దృష్టికి తీసుకు వచ్చారు. కేంద్రం ఈ విషయం జోక్యం చేసుకోవాలని రామ్మోహన్ నాయుడు కోరారు. అయితే కియా తరలిస్తున్నారన్న అంశంలో వాస్తవం లేదన్నారు హింధూపూర్ ఎంపీ గోరంట్ల మాధవ్ తెలిపారు. రామ్మోహన్ నాయుడు సీటు దగ్గరకు వెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేశారు ఎంపీ గోరంట్ల మాధవ్. వైసీపీ ఎంపీని స్పీకర్ వారించారు.

కియా మోటర్స్ ఎక్కడికి పోవడం లేదని వైసీపీ లోక్ సబ పక్షం నేత మిథన్ రెడ్డి చెప్పారు. కియా మోటర్స్ ఎండీతో మాట్లాడానని చెప్పారు. త్వరలో కియా మోటర్స్ నుంచి అధికారిక ప్రకటన వస్తుందని మిథున్ రెడ్డి చెప్పారు. 


Full View


Tags:    

Similar News