చంద్రబాబు అధ్యక్షతన సమావేశమయిన టీడీఎల్పీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. బడ్జెట్ సమావేశాల్లో ఇటీవల జరిగిన పరిణామాలను ప్రస్తావిస్తూ ప్రభుత్వ తీరును ఎండగట్టాలని నిర్ణయించింది. కరువు, రైతుల సమస్యలపై గళం వినిపిస్తూనే టీడీపీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలపై జరుగుతున్న దాడులను ప్రస్తావించాలని చంద్రబాబు సూచించారు. ఇదే సమయంలో టీడీపీ ఎమ్మెల్యేలపై ఇటీవల పలుచోట్ల జరిగిన దాడులను ప్రసావిస్తూ సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇవ్వాలని నిర్ణయించారు.