Srisailam: ఆఖరి సోమవారం అంబరాన్నంటిన కార్తీక సంబరాలు..!
Srisailam: ప్రత్యేక పూజలు నిర్వహించిన పండితులు
Srisailam: ఆఖరి సోమవారం అంబరాన్నంటిన కార్తీక సంబరాలు..!
Srisailam: శ్రీశైలంలో కార్తీకమాసం చివరి సోమవారం కావడంతో ఆలయ పుష్కరిణి వద్ద లక్షదీపోత్సవం,దశ హారతులిచ్చారు. ఆలయ పుష్కరిణి వద్ద దేవస్థానం ఆధ్వర్యంలో లక్షదీపోత్సవం కన్నుల పండువగా జరిగింది. అర్చకులు, వేదపండితులు దీపోత్సవ సంకల్పాన్ని పఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవ మూర్తులకు, పుష్కరిణికి శాస్త్రోక్తంగా దశ హరతులిచ్చి భక్తులను దీవించారు. దశ హారతులను దర్శించుకునేందుకు పుష్కరిణి భక్తులతో కిటకిటలాడింది.