ఏపీ సర్కార్పై బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. గతంలో పార్టీలన్నీ అమరావతికి మద్దతిచ్చాయన్నారు. అమరావతి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా ఇచ్చిందని... రాజధానిపై ఇష్టమొచ్చినట్లు నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు.
అయితే రాజధాని అంశంపై తాము స్పష్టంగా ఉన్నామని చెప్పారు. స్టేక్ హోల్డర్స్ ఆమోదం లేకుండా రాజధాని మార్చే అధికారం ఈ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు.