తూర్పుగోదావరి జిల్లాలోని దేవిపట్నం మండలం కచ్చులూరు సమీపంలో పర్యాటక పడవ మునిగిన సంగతి తెలిసిందే. ఆ ప్రాంతంలో ఇలాంటి ప్రమాదం జరగడం ఇది తొలిసారేం కాదు. గతంలో కూడా కచ్చులూరు దగ్గర రెండు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. 1960లో ఉదయభాస్కర్ అనే బోటు మునిగి 60 మంది మృతిచెందగా.. ఆ తర్వాత జాన్సీ అనే బోటు మునిగి 8 మంది మృతిచెందారు.