Tirumala: తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు

Tirumala: శ్రీవారిని దర్శించుకున్న ఏపీ డీజీపీ, బాలీవుడ్ నటి జాన్వీకపూర్

Update: 2022-09-02 07:59 GMT

Tirumala: తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు

Tirumala: తిరుమల శ్రీవారిని బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్, ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి వేర్వేరుగా దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో జాన్వీ స్వామివారి సేవలో పాల్గొన్నారు. అధికారులు ఆమెకు దర్శన ఏర్పాట్లు చేసి అనంతరం స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. సాంప్రదాయ వస్త్రధారణతో జాన్వీ అందరిని ఆకట్టుకున్నారు. ఇవాళ తెల్లవారుజామన ఏపీ డీజీపీ రాజేంద్ర నాథ్ రెడ్డి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Tags:    

Similar News